పీవీ పోస్టల్ స్టాంప్.. హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్
ABN , First Publish Date - 2020-06-30T19:17:58+05:30 IST
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మోదీ సర్కార్ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ పోస్టల్ స్టాంప్ చారిత్రక నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని తెలంగాణ బీజేపీ స్వాగతిస్తోందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన ఘనత పీవీదని ఆయన తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణకు, తెలుగు వారికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.