సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-03T20:12:26+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేంద్రం నిష్పక్షపాతంగా నిధులు ఇస్తుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, పన్ను కడితేనే కేంద్రం నిధులు ఇస్తుందని చెబుతున్నారని అన్నారు. ఆ పన్నులు కేసీఆర్ జాగీరా? లేక ఆయన ఇంట్లో ముద్ర వేసి పన్నులు కడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులేకదా ప్రభుత్వం కేంద్రానికి కడుతుందని ఆయన అన్నారు.

Updated Date - 2020-11-03T20:12:26+05:30 IST