రాములమ్మను పొగడ్తలతో ముంచెత్తిన బండి సంజయ్
ABN , First Publish Date - 2020-11-03T20:06:47+05:30 IST
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి బీజేపీ చేరికపై జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి గురించి మీడియా ఎదుట ప్రస్తావించారు. రాములమ్మను బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని కొనియాడారు. తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రాములమ్మ బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.