కరోనా పరీక్షలు చేయడంలో రాష్ట్రం విఫలం: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-06-22T17:39:38+05:30 IST

హైదరాబాద్: కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కరోనా పరీక్షలు చేయడంలో రాష్ట్రం విఫలం: బండి సంజయ్

హైదరాబాద్: కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా పరీక్షలు చేస్తోంటే.. తెలంగాణలో వేల సంఖ్యలో కూడా చేయలేదని సంజయ్ విమర్శించారు. 


కరోనా కట్టడిపై ప్రభుత్వ పెద్దలతో చర్చకు సిద్ధమన్నారు. కరోనా అంటే.. ఓనర్లకు, క్లీనర్లకు మధ్య యుద్దం కాదని మంత్రి ఈటల గుర్తుంచుకోవాలన్నారు. జేపీ నడ్డా నిజాయితీని ప్రశ్నించే హక్కు మంత్రులకు లేదన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ తన అహాన్ని వీడి.. వైద్యులు, పోలీసులను కాపాడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-06-22T17:39:38+05:30 IST