బీజేపీ అధికారంలోకి రాగానే...: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-12-06T16:51:53+05:30 IST
అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి అంబేద్కర్ అన్నారు.

హైదరాబాద్: అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి అంబేద్కర్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ జయంతి, వర్థంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే అంబేద్కర్ విగ్రమం ఏర్పాటు చేస్తామన్నారు.