ధరణి సేవలపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2020-11-21T10:24:44+05:30 IST
ధరణి సేవలపై అవగాహన కల్పించాలి

కొత్తగూడ, నవంబరు 20: గ్రామాల్లోని ప్రజలకు ధరణి సేవలపై అవగాహన కల్పించాలని ఆర్డీవో కొమురయ్య అధికారులకు సూచించారు. కొత్తగూడలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించి రెవెన్యూ అధికారులు, వీఆర్వోల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మీసేవ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు.