శభాష్ ఆటోవాలా..!
ABN , First Publish Date - 2020-10-03T15:18:32+05:30 IST
ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. మీర్పేటకు చెందిన వి.పద్మ హైదరాబాద్ పోలీస్

హైదరాబాద్ : ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. మీర్పేటకు చెందిన వి.పద్మ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లక్డ్డీకపూల్ వెళ్లేందుకు దిల్సుఖ్నగర్లో రమావత్ నారాయణ అనే ఆటోడ్రైవర్ ఆటో ఎక్కారు. పద్మ లక్డీకపూల్లో ఆటో దిగి వెళ్లిపోయే సమయంలో ఏటీఎం, ఐడీ కార్డులతో కూడిన పర్సును మరిచిపోయారు. తిరిగి దిల్సుఖ్నగర్కు వచ్చిన ఆటోడ్రైవర్ నారాయణ వెనుక సీట్లో పర్సును గమనించి సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. పర్సులోని ఐడీ కార్డుల ఆధారంగా పద్మకు సరూర్నగర్ పోలీసులు సమాచారం ఇచ్చి పర్సును ఆందజేశారు. నిజాయితీగా పర్సును పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్ నారాయణను సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, ఎస్ఐ సంజీవరెడ్డి అభినందించారు.