సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్పై దాడికి యత్నం
ABN , First Publish Date - 2020-06-11T22:21:33+05:30 IST
ఎస్ ఇటిక్యాలలో కలకలం రేగింది.

సంగారెడ్డి జిల్లా: ఎస్ ఇటిక్యాలలో కలకలం రేగింది. సర్పంచ్ రాదయ్యపై మంజుల అనే మహిళ దాడికి యత్నించింది. మంజుల భర్త వికలాంగుడు.. దీంతో తమ కుటుంబ వ్యవహారాలపై సర్పంచ్ రాదయ్య అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మంజుల ఆరోపించింది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగగా గురువారం వెలుగులోకి వచ్చింది. మంజుల తన మామతో గొడవలు ఉన్నాయి. వారికి ఏడు ఎకరాల భూమి ఉంది. అందులో తమకు వాటా వస్తుందని మంజుల తన మామతో గొడవకు దిగింది.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న సర్పంచ్ తాను భూమి అమ్మి మంజుల కుమార్తెలకు వివాహాలు చేస్తానని మాటిచ్చారని మంజుల ఆరోపించింది. దీనిపై పెద్ద మనుషుల వద్ద పంచాయతీ నడుస్తోంది. అయినా పరిష్కారం కాలేదు. భూమి తనకు కాకుండా సర్పంచ్ తన మామ పక్కన చేరాడని మంజుల భావించింది. దీంతో నిన్న సర్పంచ్ను అడ్డుకుని ఆయనను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకుని మంజులను సముదాయించారు.