గిరిజనులపై దాడులను ఆపాలి: పేదల సంఘం
ABN , First Publish Date - 2020-06-22T09:35:00+05:30 IST
పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులు, గిరిజనేతరులపై దాడులు ఆపాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది.

హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులు, గిరిజనేతరులపై దాడులు ఆపాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం సర్వే చేసి అర్హులైన పేదలను గుర్తించి పట్టాలివ్వాల్సి ఉండగా 15 ఏళ్లు గడిచినా ప్రభుత్వం సర్వే చేయడం లేదని సంఘం ఆరోపించింది.