హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2020-11-21T09:34:36+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

బీజేపీ, కాంగ్రె్‌సకు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్

‌ 

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. చర్చించేందుకు తాము ఎక్కడికైనా వస్తామని, ఆ దమ్ము ఆ రెండు పార్టీలకు ఉందా? అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో ఈ విషయం స్పష్టమైందన్నారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేసింది బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను దేశద్రోహి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంబోధించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. తిట్లతో ఓట్లు రాలవని హితవుపలికారు. 

Updated Date - 2020-11-21T09:34:36+05:30 IST