ఓటరు నమోదులో నిర్లక్ష్యం వద్దు
ABN , First Publish Date - 2020-12-30T04:17:57+05:30 IST
ఓటరు నమోదులో నిర్లక్ష్యం వద్దు
రాష్ట్ర పరిశీలకురాలు అనితా రాజేంద్ర
జనగామ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియను పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకురాలు అనితా రాజేంద్ర అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై మంగళవారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఓటరు నమోదు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాలన్నారు. జిల్లాలో ఫారం-6 కింద 1876, ఫారం-7 కింద 5640, ఫారం-8 కింద 491, ఫారం-8ఏ కింద 28 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఫారం-6ఏ కింద ఎన్ఆర్ఐ ఓటర్లు 19 మంది దరఖాస్తు చేసుకోగా 10 దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆమె సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఆర్వో మాలతి, జనగామ ఆర్డీవో మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.