తెలంగాణ భూభాగంలో ఆంధ్రా చెక్పోస్టు
ABN , First Publish Date - 2020-04-12T09:25:26+05:30 IST
ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి వస్తున్న వారిని నియంత్రించేందుకు సూర్యాపేట జిల్లా సరిహద్దులోని గరికపాడు

కోదాడరూరల్, ఏప్రిల్ 11: ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి వస్తున్న వారిని నియంత్రించేందుకు సూర్యాపేట జిల్లా సరిహద్దులోని గరికపాడు వద్ద ఏపీ పోలీసులు ఇప్పటికే ఓ చెక్పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తాజాగా తెలంగాణ భూభాగంలో అరకిలోమీటరు లోనికి చొచ్చుకొచ్చి సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద మరో చెక్పోస్టు ఏర్పాటు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గరికపాడు చెక్పోస్టును కొనసాగిస్తూనే, అనుబంధంగా కొత్త చెక్పోస్టు పని చేస్తుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. కానీ, తెలంగాణ భూభాగంలో ఎలా ఏర్పాటు చేస్తారని రాష్ట్ర పోలీసులు ప్రశ్నిస్తున్నారు.