మెట్టుగుట్టపై పురాతన జైనమత ప్రాభవ చిహ్నాలు

ABN , First Publish Date - 2020-12-29T06:05:34+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జైన మత ప్రాభవ చిహ్నాలు బయల్పడ్డాయి. కాజీపేట మండలంలోని మెట్టుగుట్టపై సోమవారం ఓ లఘుశాసనం లభ్యమైంది. తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్‌

మెట్టుగుట్టపై పురాతన జైనమత ప్రాభవ చిహ్నాలు

హన్మకొండ, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జైన మత ప్రాభవ చిహ్నాలు బయల్పడ్డాయి. కాజీపేట మండలంలోని మెట్టుగుట్టపై సోమవారం ఓ లఘుశాసనం లభ్యమైంది. తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్‌ మడకొండలో పరిశోధన చేస్తున్నప్పుడు ఈ శాసనంతో పాటు జైనమతానికి చెందిన ధర్మనాథుని ప్రతిమ, పాదాలను గుర్తించారు. ఈ లఘు శాసనంలో జినబ్రహ్మజోగి అని రాసి ఉంది. ఈ శాసనం పైభాగాన ధర్మనాథుని పాదాలు, ఆ పక్కన ధర్మనాథుని చిన్న విగ్రహం ఉంది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో జైన మత ప్రాభవానికి సాక్ష్యాలుగా.. ఎన్నో శిథిలమైన జైనబసదులు, మందిరాలు, శిల్పాలు కనిపిస్తాయని, రాష్ట్రకూటుల కాలంలో ఈ ప్రాంతాన్ని ఏలిన కొలనుపాక మహామండలేశ్వరుడు శంకరగండరస (క్రీ.శ 888) ఎన్నో జైనబసదులు, జైన మందిరాలు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని సునీల్‌ చెప్పారు.  

Updated Date - 2020-12-29T06:05:34+05:30 IST