216 టీఎంసీలను కేటాయించండి

ABN , First Publish Date - 2020-09-05T09:34:15+05:30 IST

తాగు, సాగు అవసరాల కోసం డిసెంబరు వరకు 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డును

216 టీఎంసీలను కేటాయించండి

  • కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తాగు, సాగు అవసరాల కోసం డిసెంబరు వరకు 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ బోర్డు కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. ప్రస్తుతం నాగార్జునాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టాలున్నాయని, దాంతో నీటి కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని లేఖలో పేర్కొన్నారు. ఈ నీటిలో సాగర్‌ కుడి కాల్వ అవసరాల కోసం 90 టీఎంసీలు, ఎడమకాల్వకు 20 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని కర్నూలు, కడప అవసరాల కోసం 79 టీఎంసీలు, హంద్రీ-నీవా కోసం 27 టీఎంసీలను కేటాయించాలని కోరారు. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఈ నీటిని ఉపయోగించుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-05T09:34:15+05:30 IST