ఆ నిధులు ‘ఫండ్’కు ఎలా ఇస్తారు?: ఏఐటీయూసీ
ABN , First Publish Date - 2020-05-08T10:48:36+05:30 IST
ఆ నిధులు ‘ఫండ్’కు ఎలా ఇస్తారు?: ఏఐటీయూసీ
![ఆ నిధులు ‘ఫండ్’కు ఎలా ఇస్తారు?: ఏఐటీయూసీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంచిర్యాల, మే 7(ఆంధ్రజ్యోతి): సింగరేణి ప్రాంత అభివృద్ధి, సంక్షేమానికి వినియోగించాల్సిన సీఎ్సఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులను సీఎం రిలీఫ్ ఫండ్కు ఎలా ఇస్తారని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ను ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రశ్నించారు. ఆయ న గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీధర్ సీఎంకు రూ.40 కోట్ల చెక్కు ఇచ్చారని, ఇందులో సీఎస్ఆర్ నిధులున్నాయన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.