మనూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
ABN , First Publish Date - 2020-06-26T07:56:45+05:30 IST
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2020-21 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది.
![మనూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్ సిటీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2020-21 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, డీఈఐఈడీ, పాలిటెక్నిక్, పీజీ, ఇతర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 10. రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. మెరిట్ బేస్డ్ కోర్సులకు ఆగస్టు 10లోపు దరఖాస్తు చేసుకోవాలి.