ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు: ఏబీవీపీ
ABN , First Publish Date - 2020-08-13T07:41:47+05:30 IST
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ‘దోస్త్’ నోటిఫికేషన్ను బేఖాతరు చేస్తూ అడ్మిషన్లు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డికి బుధవారం ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.