కాంగ్రె్‌సలోకి ఆదిభట్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2020-12-29T07:33:15+05:30 IST

కొద్ది రోజుల కిందట కాంగ్రె్‌సను వీడి అధికార టీఆర్‌ఎ్‌సలో చేరి ఆదిభట్ల మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కొత్త ఆర్థీక ప్రవీణ్‌గౌడ్‌..

కాంగ్రె్‌సలోకి ఆదిభట్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

11 నెలల వ్యవధిలోనే తిరిగి సొంత గూటికి..

కోమటిరెడ్డి సమక్షంలో చేరిన ఆర్థీకగౌడ్‌


ఆదిభట్ల/ హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కొద్ది రోజుల కిందట కాంగ్రె్‌సను వీడి అధికార టీఆర్‌ఎ్‌సలో చేరి ఆదిభట్ల మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కొత్త ఆర్థీక ప్రవీణ్‌గౌడ్‌.. తిరిగి సొంత గూటికి చేరారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఆర్థీక.. తర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కానీ.. పదకొండు నెలల వ్యవధిలోనే తిరిగి సొంత గూటికి వెళ్లారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మళ్లీ ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందధని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-29T07:33:15+05:30 IST