జీతాలు చెల్లించకుంటే చర్యలు: ఇంటర్ బోర్డు
ABN , First Publish Date - 2020-09-12T08:21:55+05:30 IST
లెక్చరర్లను తొలగించినా, కరోనా కారణం చూపి జీతాలు చెల్లించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు కాలేజీల

లెక్చరర్లను తొలగించినా, కరోనా కారణం చూపి జీతాలు చెల్లించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను ఇంటర్బోర్డు హెచ్చరించింది.
జీవో ఎంఎస్ నంబర్-45కు వ్యతిరేకంగా వ్యవహరించిన కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని, తాత్కాలికంగా ఈ విద్యాసంవత్సరం గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ పేర్కొన్నారు.