పేద రైతులను పట్టించుకోని కొత్త చట్టం

ABN , First Publish Date - 2020-09-13T08:18:23+05:30 IST

కొత్త రెవెన్యూ చట్టం రెవెన్యూ సమస్యలన్నిటికీ సమగ్ర పరిష్కారం చూపడంలేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం.కోదండరాం,

పేద రైతులను పట్టించుకోని కొత్త చట్టం

టీజేఎస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ విమర్శ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కొత్త రెవెన్యూ చట్టం రెవెన్యూ సమస్యలన్నిటికీ సమగ్ర పరిష్కారం చూపడంలేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం.కోదండరాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్రనాయకులు డీజీ.నర్సింహారావు, న్యూ డెమోక్రసీ నాయకులు పోటు రంగారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


కొత్త చట్టంపై పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయశాస్త్ర నిపుణులతో సమావేశమై చర్చించినట్లు  తెలిపారు. ఈ బిల్లు కేవలం రిజిస్ట్రేషన్‌, పట్టాదార్‌ పాస్‌బుక్‌ వంటి అంశాలకే పరిమితమైందన్నారు. పేద రైతుల హక్కుల పరిరక్షణకు సవరణలు చేయవలసి ఉందని పేర్కొన్నారు.

సాదా బైనామా గల సుమారు 11 లక్షల మంది రైతుల హక్కుల క్రమబద్ధీకరణకు సంబంధించి బిల్లులో ఏమీలేదన్నారు.  నిర్దిష్టమైన వ్యవఽధిలో సమగ్ర  భూసర్వే చేయించి పేద రైతుల హక్కులను కాపాడాలన్నారు. 


Updated Date - 2020-09-13T08:18:23+05:30 IST