నాగర్ కర్నూల్ జిల్లా: రైతుపై విరిగిన లాఠీ
ABN , First Publish Date - 2020-06-25T18:34:57+05:30 IST
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కోసం వెళ్లిన ఓ రైతుపై పోలీసులు..

నాగర్ కర్నూల్ జిల్లా: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కోసం వెళ్లిన ఓ రైతుపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది. కోడేరులో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలుచున్నారు. ఓ మహిళా రైతు విత్తనాల కోసం లైన్లో ఉండగా ఆమె కుమారుడు పక్కన కూర్చున్నాడు. అలా కూర్చోకూడదంటూ పోలీసులు ఆ యువకుడిపై దాడికి దిగారు. అదేంటని మిగిలిన రైతులు ప్రశ్నించినా పూర్తిగా కొట్టిన తర్వాతే వదిలిపెట్టారు. పోలీసులు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉంటున్నారని నిలబడలేక పక్కన కూర్చున్నవ్యక్తిపై దాడి చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.