721 కొత్త కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-12-10T10:24:33+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా మరో 7,21 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,75,261కి చేరింది. ఇన్ఫెక్షన్తో మరో ముగ్గురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,480కి పెరిగింది

హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో 7,21 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,75,261కి చేరింది. ఇన్ఫెక్షన్తో మరో ముగ్గురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,480కి పెరిగింది. మంగళవారం మరో 753 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు 2,66,120 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,661 యా క్టివ్ కొవిడ్-19 కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 123 పాజిటివ్లు రాగా, మేడ్చల్లో 58, రంగారెడ్డిలో 51, వరంగల్ అర్బన్లో 47 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి.