5,834 ఉద్యోగాలు భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2020-03-16T09:24:46+05:30 IST
వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖల్లో ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఉద్యోగాలివ్వాలని అభ్యర్థులు డిమాం డ్ చేశారు. ఆదివారం
టీఎ్సపీఎస్సీకి అభ్యర్థుల డిమాండ్
ఆబిడ్స్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖల్లో ఉద్యోగాల కోసం రెండేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఉద్యోగాలివ్వాలని అభ్యర్థులు డిమాం డ్ చేశారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఆయా విభాగాల్లో 5,834 ఉద్యోగాల కోసం 2017లో నోటిఫికేషన్ ఇవ్వగా 2018లో పరీక్షలు రాశామన్నారు. ఉద్యోగాలివ్వని ప్రభుత్వ తీరుపై సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.