రైల్వేకు తెలంగాణ బకాయిలు 499 కోట్లు

ABN , First Publish Date - 2020-03-19T10:27:13+05:30 IST

తెలంగాణాలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేంద్రానికి రూ.499 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర రైల్వే మంత్రి

రైల్వేకు తెలంగాణ  బకాయిలు 499 కోట్లు

ముంబైకి హైస్పీడు రైలు: పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణాలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేంద్రానికి రూ.499 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. దీని వల్ల భూసేకరణతో పాటు అటవీ, వన్యప్రాణి విభాగాల అనుమతుల్లో ఆలస్యం కారణంగా అనేక ప్రాజెక్టులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతున్నదని లోక్‌సభలో వివరించారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


రాష్ట్రం లో రూ.20,226కోట్లతో 13 ప్రాజెక్టుల ద్వారా 1,604 కిలోమీటర్ల మేర లైన్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. వీటికి మార్చి 2019 వరకూ రూ.3,037 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. బీబీనగర్‌-విష్ణుపురం లైను డబ్లింగ్‌ పనులకు డీపీఆర్‌ రూపొందిస్తున్నామన్నారు. 

Updated Date - 2020-03-19T10:27:13+05:30 IST