నల్గొండలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-07-19T00:22:20+05:30 IST
నల్గొండలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

నల్గొండ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఈ రోజు 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడించారు. జిల్లాలో 402 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 312 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కరోనా వల్ల 13 మంది మృతి చెందారు.