కూకట్పల్లిలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-07-11T03:00:08+05:30 IST
కూకట్పల్లిలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కూకట్పల్లి జంట సర్కిల్ లలో శుక్రవారం రోజు కొత్తగా 29 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. మూసాపేట్ సర్కిల్ లో 19 కేసులు, కూకట్పల్లి సర్కిల్ లో 10 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజు ఒక్క మూసాపేట్ డివిజన్ లోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయని, ఈ రోజు మూసాపేట్ డివిజన్ లో 13 కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.