గిఫ్ట్ ఎ స్మైల్కు మరో 21 ఆంబులెన్సులు
ABN , First Publish Date - 2020-10-04T07:46:28+05:30 IST
గిఫ్ట్ ఎ స్మైల్కు ప్రజాప్రతినిధుల నుంచి మంచి స్పందన వస్తోంది.
హైదరాబాద్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): గిఫ్ట్ ఎ స్మైల్కు ప్రజాప్రతినిధుల నుంచి మంచి స్పందన వస్తోంది. వారందించిన 21 అంబులెన్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీలు రంజిత్రెడ్డి, శ్రీనివా్సరెడ్డి మూడు అంబులెన్సుల చొప్పున అందజేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి రెండు, మంత్రులు శ్రీనివా్సగౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఉపేందర్రెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డి, వరంగల్కు చెందిన లక్ష్మణరావులు ఒక్కో అంబులెన్సు చొప్పున ఇచ్చారు. ఇవి మహబూబ్నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సేవలందించనున్నాయని మంత్రి తెలిపారు.