రుణ మాఫీకి 1,200 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2020-06-01T08:58:30+05:30 IST

రాష్ట్రంలోని రైతులకు రూ. 25 వేల రుణ మాఫీ తక్షణమే చేయడానికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్లు

రుణ మాఫీకి 1,200 కోట్లు మంజూరు

  •  త్వరలో నర్సాపూర్‌కు కాళేశ్వరం జలాలు: హరీశ్‌రావు 

నర్సాపూర్‌, మే 31: రాష్ట్రంలోని రైతులకు రూ. 25 వేల రుణ మాఫీ తక్షణమే చేయడానికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పరిధిలోని రాయరావు చెరువు పూడికతీత పనులతో పాటు శివ్వంపేటలో తాగునీటి కోసం చేపట్టిన సంప్‌ నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించిన అనంతరం మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించిన డబ్బు వెంటనే రైతుల ఖాతాలో జమ అయ్యేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 


Updated Date - 2020-06-01T08:58:30+05:30 IST