క్రిస్మస్‌కు 12 అదనపు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-12-05T08:42:52+05:30 IST

క్రిస్మస్‌ పండుగను దృష్టిలో పెట్టుకుని అదనంగా 12 ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లు అని పేర్కొంది.

క్రిస్మస్‌కు 12 అదనపు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ పండుగను దృష్టిలో పెట్టుకుని అదనంగా 12 ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లు అని పేర్కొంది. ప్రతి రోజూ నడిచే చామరాజనగర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 7న ప్రారంభమై 31 వరకు కొనసాగుతుందని, తిరుపతి-చామరాజనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(డెయిలీ) 8న ప్రారంభమై జనవరి 1 వరకు కొనసాగుతుందని వివరించింది.


కేఎ్‌సఆర్‌ బెంగళూరు-నాందెడ్‌ ఎక్స్‌ప్రెస్‌(డెయిలీ) ఈ నెల 7న ప్రారంభమై జనవరి 1 వరకు, నాందెడ్‌-కేఎ్‌సఆర్‌ బెంగళూరు ఎక్స్‌ప్రె్‌స(డెయిలీ) 9న ప్రారంభమై జనవరి 1 వరకు కొనసాగుతాయని తెలిపింది. మైసూరు-బాగల్‌కోట్‌ రైలు(డెయిలీ) 7న ప్రారంభమై ఈనెల 16 వరకు, బాగల్‌కోట్‌-మైసూరు 8న ప్రారంభమై ఈ నెల 17 వరకు కొనసాగుతాయి. గురువారం నడిచే యశ్వంత్‌పూర్‌-జైపూర్‌ సువిధ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 17, 24, 31 తేదీల్లో యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరుతుంది.


శనివారం నడిచే జైపూర్‌-యశ్వంత్‌పూర్‌ రైలు ఈ నెల 12, 19, 26, జనవరి 2 తేదీల్లో బయలుదేరుతుంది. శుక్రవారం నడిచే కేఎ్‌సఆర్‌ బెంగళూరు-ఆజ్మేర్‌ రైలు ఈ నెల 11, 18, 25 తేదీల్లో, సోమవారం నడిచే ఆజ్మేర్‌-బెంగళూరు రైలు ఈ నెల 14, 21, 28 తేదీల్లో బయలుదేరుతాయి.

ఆదివారం నడిచే కేఎ్‌సఆర్‌ బెంగళూరు-జోధ్‌పూర్‌ రైలు ఈ నెల 13, 20, 27 తేదీల్లో, ప్రతి బుధవారం నడిచే జోధ్‌పూర్‌-కేఎ్‌సఆర్‌ బెంగళూరు రైలు ఈ నెల 16, 23, 30 తేదీల్లో ప్రారంభమవుతాయని రైల్వే శాఖ వివరించింది. 


Updated Date - 2020-12-05T08:42:52+05:30 IST