1,015 కరోనా కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-11-13T09:11:20+05:30 IST

రాష్ట్రంలో బుధవారం 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల

1,015 కరోనా కొత్త కేసులు

రాష్ట్రంలో వైర్‌సతో మరో ముగ్గురి మృతి

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,54,666కు, మృతుల సంఖ్య 1,393కు పెరిగింది. తాజాగా 1,716 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,35,950కు చేరింది. రికవరీ రేటు 92.65 శాతంగా ఉంది. 17,323 యాక్టివ్‌ కేసులకు గాను, 14,694 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు.


బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 40,603 నమూనాలను సేకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 47,70,004 నమానాలను పరీక్షించినట్లు తెలిపింది. మరో 377 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వివరించింది. తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సంఖ్య 1,28,157కు పెరిగిందని పేర్కొంది.


కాగా, కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 172 రాగా, తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (98), మేడ్చల్‌-మల్కాజిగిరి (97), నల్లగొండ (57), ఖమ్మం (48), కరీంనగర్‌ (46) ఉన్నాయి. కుమ్రంభీం-అసిఫాబాద్‌లో 5, ఆదిలాబాద్‌లో 6, నారాయణపేటలో రెండు నమోదయ్యాయి.


Updated Date - 2020-11-13T09:11:20+05:30 IST