తెలంగాణ త్వరగా కోలుకోవాలి
ABN , First Publish Date - 2020-10-16T10:07:19+05:30 IST
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. ‘ఆ రాష్ట్రంలో మరింత నష్టం జరగకూడదని కోరుకుంటున్నా. వరద ప్రాంతాలలో అక్కడి యంత్రాంగం అత్యుత్తమంగా శ్రమిస్తోంది. వర్షం, వరదలతో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’ అని యువీ గురువారం ట్వీట్ చేశాడు.