విండీస్-కివీస్‌ మూడో టీ20 వర్షార్పణం

ABN , First Publish Date - 2020-12-01T09:35:27+05:30 IST

న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య సోమవారం జరగాల్సిన మూడో టీ-20 వర్షంతో రద్దయింది. దీంతో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన కివీస్‌ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు న్యూజిలాండ్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌కి దక్కింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ప్రత్యర్థిని

విండీస్-కివీస్‌ మూడో టీ20 వర్షార్పణం

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య సోమవారం జరగాల్సిన మూడో టీ-20 వర్షంతో రద్దయింది. దీంతో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన కివీస్‌ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు న్యూజిలాండ్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌కి దక్కింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విండీస్‌ 2.2 ఓవర్ల వద్ద 25/1 స్కోరుతో ఉండగా వర్షం ప్రారంభమైంది. దీంతో అరగంట పాటు మ్యాచ్‌ని నిలిపేశారు. ఆతర్వాత చెరో ఐదు ఓవర్లు ఆడేలా మ్యాచ్‌ నిర్వహించేందుకు ప్రయత్నించగా వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపడంతో మొత్తానికి ఆటను రద్దు చేశారు.

Updated Date - 2020-12-01T09:35:27+05:30 IST