ఇండియా వస్తారుగా.. అప్పుడు చూపిస్తా: మరోమారు దొరికిపోయిన కోహ్లీ

ABN , First Publish Date - 2020-03-03T00:57:12+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరోమారు వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో

ఇండియా వస్తారుగా.. అప్పుడు చూపిస్తా: మరోమారు దొరికిపోయిన కోహ్లీ

క్రైస్ట్‌చర్చ్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరోమారు దొరికిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ అవుటైనప్పుడు మైదానంలో కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అసభ్య పదజాలంతో దూషించడం, ప్రేక్షకులకు వేలు చూపించడం వంటివి విమర్శలకు కారణమయ్యాయి. అయితే, ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.


మూడో రోజు ఆటలో  స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ పదేపదే అన్న మాట ఒకటి ఇప్పుడు మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ‘‘జబ్ ఇండియా మే యే లోగ్ ఆతేంగే, తబ్ దిఖా దూంగా’’ (వీరు ఇండియా వస్తారుగా.. అప్పుడు చూపిస్తా) అని పదేపదే అరుస్తూ కనిపించాడు. 

Updated Date - 2020-03-03T00:57:12+05:30 IST