హాకీ ఇండియా కార్యాలయంలో ఇద్దరికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-05-31T20:41:11+05:30 IST
హాకీ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని 14 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని 14 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు అకౌంట్ల విభాగంలో పని చేస్తుండగా.. మరొకరు జూనియర్ ఫీల్డ్ అఫీసర్ అని వెల్లడించారు. వీరిద్దరిని ఢిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోమ్ క్వారంటైన్లో ఉంచామని తెలిపారు.
దీని కారణంగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, ఒలింపిక్ అసోసియేషన్లుతో పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉద్యోగులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బత్రా ఆదేశించారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ ప్రతీ ఉద్యోగి ఇంటి నుంచే పని చేయాలని ఆయన తెలిపారు.
కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగిన ఇద్దరు ఉద్యోగులకు ఆదివారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు.