రియల్‌ హీరోలకు క్రీడాలోకం సెల్యూట్‌

ABN , First Publish Date - 2020-06-18T07:37:06+05:30 IST

లద్దాఖ్‌ ఘటనపై క్రీడాలోకం స్పందించింది. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సాకర్‌ మాజీ సారథి బైచుంగ్‌ భూటియా సహా అనేకమంది సోషల్‌ మీడియా ద్వారా నివాళి ప్రకటించారు. ‘అమర జవాన్లకు వందనాలు.

రియల్‌ హీరోలకు క్రీడాలోకం సెల్యూట్‌

న్యూఢిల్లీ: లద్దాఖ్‌ ఘటనపై క్రీడాలోకం స్పందించింది. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సాకర్‌ మాజీ సారథి బైచుంగ్‌ భూటియా సహా అనేకమంది సోషల్‌ మీడియా ద్వారా నివాళి ప్రకటించారు. ‘అమర జవాన్లకు వందనాలు. ఓ సైనికుడి కంటే నిస్వార్ధమైన, ధైర్యవంతుడైన వ్యక్తి మరొకరుండరు. ఈ సమయంలో మన ప్రార్థనల ద్వారా జవాన్ల కుటుంబీకులకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని విరాట్‌ ట్వీట్‌ చేయగా.. ‘సరిహద్దుల్లో ఉంటూ మన ప్రాణాలను కాపాడుతున్న రియల్‌ హీరోలకు సెల్యూట్‌’ అని రోహిత్‌ శర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మన ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి’ అని భూటియా పోస్ట్‌ చేశాడు. వీరితోపాటు హర్భజన్‌, యువరాజ్‌, ధవన్‌, సైనా నెహ్వాల్‌, సుశీల్‌, యోగేశ్వర్‌.. జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-06-18T07:37:06+05:30 IST