రేసులో టాటా సన్స్
ABN , First Publish Date - 2020-08-15T08:57:25+05:30 IST
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షి్పకు దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. ఇక.. వైదొలగిన చైనా కంపెనీ వివో స్థానంలో స్పాన్సరర్గా హక్కులు ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడు
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షి్పకు దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. ఇక.. వైదొలగిన చైనా కంపెనీ వివో స్థానంలో స్పాన్సరర్గా హక్కులు ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్రీమ్ లెవెన్, టాటా సన్స్, బైజూస్, రిలయన్స్ జియో, పతంజలి, అన్అకాడమీ సంస్థలు స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే, వీటిలో స్వదేశంలో అతిపెద్ద బ్రాండైన టాటా సన్స్వైపే బోర్డు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక, బిడ్ ఎవరికి దక్కిందనేది ఈనెల 18వ తేదీన బీసీసీఐ ప్రకటించనుంది.
బైజూస్ అవుట్: ఐపీఎల్లో షారుక్ ఖాన్ ఆధ్వర్యంలోని కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి బైజూస్ కంపెనీ వైదొలగింది. బైజూస్ స్థానంలో మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సంస్థ తమ టైటిల్ స్పాన్సరర్గా వ్యవహరించనున్నట్టు నైట్రైడర్స్ ట్వీట్ చేసింది.