మాజీ ఫుట్బాలర్ హకీమ్కు కరోనా
ABN , First Publish Date - 2020-07-16T09:18:53+05:30 IST
హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ మాజీ ఫుట్బాలర్, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత సయ్యద్ షాహిద్ హకీమ్ (81)కు కరోనా వైరస్ ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ మాజీ ఫుట్బాలర్, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత సయ్యద్ షాహిద్ హకీమ్ (81)కు కరోనా వైరస్ సోకింది. ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లొచ్చిన హకీమ్.. ఆ తర్వాత నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. వారం క్రితం కొవిడ్ పరీక్ష చేయించుకోగా, పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ‘రెండ్రోజుల నుంచి నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకొని మీ ముందుకొస్తా’ అని హకీమ్ తెలిపాడు. హకీమ్.. 1960 రోమ్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత ఫుట్బాల్ జట్టులో సభ్యుడు.