గవాస్కర్, పుజార విరాళాలు
ABN , First Publish Date - 2020-04-08T09:06:11+05:30 IST
కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న బాధితులను ఆదుకునేందుకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రూ.59 లక్షలను విరాళంగా ఇచ్చాడు. ఇందులో రూ.35 లక్షలు ప్రధాని సహాయ నిధికి, రూ.24 లక్షలు మహారాష్ట్ర సీఎంఓకు సన్నీ అందించాడు.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న బాధితులను ఆదుకునేందుకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రూ.59 లక్షలను విరాళంగా ఇచ్చాడు. ఇందులో రూ.35 లక్షలు ప్రధాని సహాయ నిధికి, రూ.24 లక్షలు మహారాష్ట్ర సీఎంఓకు సన్నీ అందించాడు. ఇక, భారత టెస్టు క్రికెటర్ చటేశ్వర్ పుజార గుజరాత్ సీఎం రిలీఫ్ ఫండ్కు మంగళవారం విరాళాన్ని అందించాడు. కానీ, ఎంత మొత్తం ఇచ్చాడో గోప్యంగా ఉంచాడు.