పేదల ఆకలి తీర్చిన ద్యూతీ
ABN , First Publish Date - 2020-05-11T09:54:32+05:30 IST
భారత స్టార్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ తన స్వగ్రామంలోని పేదలకు ఆహారాన్ని అందించింది. భువనేశ్వర్ నుంచి ...
![పేదల ఆకలి తీర్చిన ద్యూతీ](https://media.andhrajyothy.com/appimg/galleries/202005110414150/05112020042425n3.jpg)
భువనేశ్వర్: భారత స్టార్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ తన స్వగ్రామంలోని పేదలకు ఆహారాన్ని అందించింది. భువనేశ్వర్ నుంచి 70 కి.మీ. దూరంలోని గోపాల్పూర్లో తన ఇంటి వద్ద వెయ్యి మందికి ఆహార పొట్లాలను ఆదివారం పంచి పెట్టింది. త్వరలోనే మరోసారి గ్రామానికొచ్చి రెండు వేల మందికి సాయం చేస్తానని ద్యూతీ తెలిపింది.