గంగూలీ, జైషా కోసం సుప్రీంలో బీసీసీఐ పిటిషన్
ABN , First Publish Date - 2020-05-24T08:21:29+05:30 IST
గంగూలీ, జైషా కోసం సుప్రీంలో బీసీసీఐ పిటిషన్
న్యూఢిల్లీ: అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పూర్తి పదవీ కాలం (మూడేళ్లపాటు) కొనసాగేలా బీసీసీఐ పావులు కదుపుతోంది. ఇందుకోసం బోర్డు రాజ్యాంగాన్ని సవరించడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. బోర్డు రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండుసార్లు బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో పని చేసిన వారు తప్పకుండా కూలింగ్ ఆఫ్ పీరియడ్కు వెళ్లాలి. దీని ప్రకారం గంగూలీ, కార్యదర్శి జైషాలు జూలై, జూన్లో తమ పదవులకు దూరం కావాల్సి ఉంటుంది. కాగా, డిసెంబరులో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రాజ్యాంగంలో మార్పులకు తీర్మానిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోశాధికారి అరుణ్ ధూమల్ తాజాగా కోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా క్రిమినల్ కేసుల్లో కోర్టు దోషిగా నిర్ణయించిన లేదా రెండు మూడేళ్లు శిక్ష అనుభవించిన వారిని బోర్డు సభ్యులయ్యేందుకు అనర్హులుగా పరిగణించే విధంగా మార్పులను ప్రతిపాదించారు.