ఆగస్టులో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ క్రికెట్ జట్టు?
ABN , First Publish Date - 2020-05-21T21:49:31+05:30 IST
మూడు టీ-20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ జట్టు రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు కోరింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా తాత్కాలి
జొహెన్నెస్బర్గ్: మూడు టీ-20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ జట్టు రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు కోరింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా తాత్కాలిక సీఈవో జాక్వెస్ ఫౌల్ వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై బీసీసీఐతో చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్కి ముందు టీం ఇండియా చివరిగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సింది. అయితే మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్లను కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేశారు. అయితే ఈ సిరీస్ని కూడా మళ్లీ నిర్వహిస్తారని.. కూడా తెలుస్తోంది. అయితే టీ-20 సిరీస్ జరిగే తేదీల గురించి ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన రాలేదు.