గెలవాల్సింది.. తొలి టెస్టు పరాజయంపై ఇంజమామ్!
ABN , First Publish Date - 2020-08-10T04:20:22+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి మ్యాచ్లో పాక్ జట్టు పరాజయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ అల్ హక్ స్పందించాడు.
ఇస్లామాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి మ్యాచ్లో పాక్ జట్టు పరాజయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ అల్ హక్ స్పందించాడు. ఇంగ్లండ్తో పోల్చుకుంటే పాక్ జట్టు బలమైందని, వారు మ్యాచ్లో గెలవాల్సిందని ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు. ‘ఇంగ్లండ్ కన్నా పాక్ మెరుగైన జట్టు. ఈ మ్యాచ్ మేమే గెలవాల్సింది. ఫలితం నిరుత్సాహపరిచింది. కానీ సిరీస్ మాత్రం పాక్ గెలుస్తుందని నమ్ముతున్నా’ అని ఇంజమామ్ చెప్పారు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో పాక్ గెలిచేట్టే కనిపించింది. 277 పరుగుల చేధనలో ఓ దశలో ఇంగ్లండ్ను 177/5తో ఇబ్బందుల్లో పడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని మ్యాచ్ను ఖాతాలో వేసుకుంది.