వచ్చే ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు కెప్టెన్గా డుప్లెసిస్..?
ABN , First Publish Date - 2020-11-13T22:23:24+05:30 IST
2021లో జరిగే ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీ కొనసాగకపోవచ్చని టీమిండియా మాజీ క్రికెటర్, టీమిండియా బ్యాటింగ్ కోచ్...
వచ్చే ఐపీఎల్ సీజన్లో చెన్నై కెప్టెన్గా ధోనీ కొనసాగకపోవచ్చు: సంజయ్ బంగర్
2021లో జరిగే ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీ కొనసాగకపోవచ్చని టీమిండియా మాజీ క్రికెటర్, టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పుకొచ్చారు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటేనే, ఆటగాడిగా రాణించేందుకు స్వేచ్ఛ దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలను డుప్లెసిస్కు అప్పగించాలన్న అభిప్రాయాన్ని సంజయ్ వ్యక్తం చేశారు. చెన్నై జట్టులో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టేందుకు డుప్లెసిస్ కంటే సమర్థులు లేరని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వేరే ఆప్షన్ కూడా లేదన్నారు.
చెన్నై జట్టులో కీలకంగా ఉన్న షేన్ వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐపీఎల్లో కూడా ఆడే అవకాశం లేదని, బ్రావో, ఇమ్రాన్ తాహిర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని.. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఆడేంత వరకూ నమ్మకం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో డుప్లెసిస్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందున్న ఆప్షన్ అని సంజయ్ బంగర్ చెప్పారు.