సీఎస్కేతో కలిసి.. లైవ్ సెషన్ నిర్వహించనున్న సాక్షి
ABN , First Publish Date - 2020-05-31T22:20:54+05:30 IST
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోనీ... ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్తో లైవ్ సెషన్ నిర్వహించనుంది. ఈ లైవ్లో సాక్షి ధోనీ క్రికెట్ ప్లాన్స్పై
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోనీ... ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించనుంది. ఈ లైవ్లో సాక్షి ధోనీ క్రికెట్ ప్లాన్స్పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గత బుధవారం ‘ధోనీ రిటైర్స్’ అనే హ్యాష్ట్యాగ్ సోషల్మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో సాక్షి స్పందించిన విషయం తెలిసిందే. అవన్నీ పుకార్లే అని.. ఈ లాక్డౌన్ కారణంగా కొందరి మానసిక స్థితి దెబ్బతిన్నది అంటూ సాక్షి ట్వీట్ చేసింది. కొంత సమయం తర్వాత సాక్షి ఆ ట్వీట్ని డిలీట్ చేసింది.
ఒక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు ధోనీ అభిమానులు ‘ధోనీ నెవర్ రిటైర్స్’ అనే హ్యాష్ట్యాగ్ని వైరల్ చేసి.. ధోనీ రిటైర్మెంట్పై వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు. అయితే సాక్షి నిర్వహించే ఈ లైవ్ సెషన్లో ధోనీ పాల్గొంటాడా.. లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్కి దూరంగా ఉన్న ధోనీ.. ఐపీఎల్లో పాల్గొనేందుకు చెన్నైకి వచ్చాడు. అక్కడ నిర్వహించిన ప్రాక్టీస్లోనూ అతను పాల్గొన్నాడు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించడంతో.. ఐపీఎల్ తాత్కాలికంగా రద్దైన విషయం తెలిసిందే.