‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్ పూర్తి చేసిన రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే
ABN , First Publish Date - 2020-05-17T21:36:17+05:30 IST
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రారంభించిన ‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్ను టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పూర్తి

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రారంభించిన ‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్ను టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పూర్తి చేశారు. అయితే కాస్త వినూత్నంగా వీళ్లిద్దరు ఈ ఛాలెంజ్ను పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్ చేయాల్సిందిగా రోహిత్ను యువరాజ్ నామినేట్ చేస్తే.. అనిల్ కుంబ్లేకి హర్భజన్ సింగ్ నుంచి నామినేషన్ వచ్చింది. ఈ ఛాలెంజ్ను రోహిత్ బ్యాట్ హాండిల్పై పూర్తి చేశాడు. ఈ ఛాలెంజ్ చేయాలని అతను తన తోటి క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అజింక్యా రహానేలను నామినేట్ చేశాడు. ఇక బ్యాట్ లేకపోవడంతో.. చేతితోనే ఈ ఛాలెంజ్ను పూర్తి చేసిన అనీల్ కుంబ్లే.. తదుపరిగా వీవీఎస్ లక్ష్మణ్, కేఎల్ రాహుల్, వీరేంద్ర సెహ్వాగ్లను నామినేట్ చేశారు.
ఈ ఛాలెంజ్ను టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. కళ్లకు గంతలు కట్టుకొని ఈ ఛాలెంజ్ని ఆయన పూర్తి చేశారు. అయితే చివర్లో చిన్న ట్విట్ కూడా ఇచ్చారు. కళ్లకు కట్టుకున్న గంతల నుంచి తనకు కనిపిస్తుందని సచిన్ వెల్లడించారు. అలా చేయాలని రివర్స్లో యువరాజ్నే ఆయన మళ్లీ ఛాలెంజ్ చేశారు.