రాష్ట్ర బాస్కెట్బాల్ అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి
ABN , First Publish Date - 2020-12-13T10:11:55+05:30 IST
తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షుడిగా ఎం.రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నార్మన్ ఐజాక్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సంఘం వార్షిక సర్వసభ్య

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షుడిగా ఎం.రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నార్మన్ ఐజాక్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. చైర్మన్గా శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అనంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, హఫీజ్, చంద్రశేఖర్, జయకర్, కోశాధికారిగా రఘునందన్ రెడ్డి నియమితులయ్యారు.