178 పరుగులు చేసిన పంజాబ్.. ధోనీ సేన ఏం చేస్తుందో?

ABN , First Publish Date - 2020-10-05T02:54:23+05:30 IST

చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగుల

178 పరుగులు చేసిన పంజాబ్.. ధోనీ సేన ఏం చేస్తుందో?

దుబాయ్: చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగుల డిఫెండబుల్ స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేశాడు.


మయాంక్ అగర్వాల్ 26, మన్‌దీప్ సింగ్ 27, నికోలస్ పూరన్ 33 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ 11, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-10-05T02:54:23+05:30 IST