బ్రేకింగ్ న్యూస్: పాకిస్తాన్ క్రికెట్ టీంలో ముగ్గురికి కరోనా
ABN , First Publish Date - 2020-06-23T04:49:05+05:30 IST
పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లలో ముగ్గురికి కరోనా సోకినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లలో ముగ్గురికి కరోనా సోకినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. హైదర్ అలీ, హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పీసీబీ ప్రకటించింది. వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, రావల్పిండిలో ఆదివారం టెస్ట్లు చేసిన అనంతరమే కరోనా పాజిటివ్గా తేలినట్లు తెలిపింది. ఇంగ్లండ్తో టూర్ నేపథ్యంలో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకడంతో క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.