ఆరున్నరేళ్లుగా లాక్‌డౌన్‌లోనే..

ABN , First Publish Date - 2020-05-08T09:53:37+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా దేశ ప్రజలు ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉంటున్నా..తానైతే ఆరున్నరేళ్లుగా ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నట్టు పేసర్...

ఆరున్నరేళ్లుగా లాక్‌డౌన్‌లోనే..

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దేశ ప్రజలు ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉంటున్నా..తానైతే ఆరున్నరేళ్లుగా ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నట్టు పేసర్‌ శ్రీశాంత్‌ అభిప్రాయపడ్డాడు. 2013లో వెలుగు చూసిన ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం శ్రీశాంత్‌ కెరీర్‌ను దాదాపుగా నాశనం చేసింది. ‘నేను గత ఆరున్నరేళ్లుగా లాక్‌డౌన్‌లోనే ఉంటున్నా. సినిమాలు, టీవీ షూటింగ్‌లతో గడుపుతున్నా. క్రికెట్‌ అయితే ఇప్పుడు నాతో లేదు’ అని ఈ కేరళ స్పీడ్‌స్టర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పట్లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడిగా ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించగా కోర్టు ఏడేళ్లకు కుదించింది.

Updated Date - 2020-05-08T09:53:37+05:30 IST