ఆన్లైన్ నేషన్స్కు భారత జట్టిదే..
ABN , First Publish Date - 2020-04-25T09:56:46+05:30 IST
ఫిడే ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి జరిగే ఆన్లైన్ నేషన్స్ కప్నకు భారత జట్టు సిద్ధమైంది. మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ...

చెన్నై: ఫిడే ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి జరిగే ఆన్లైన్ నేషన్స్ కప్నకు భారత జట్టు సిద్ధమైంది. మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆధ్వర్యంలో హరికృష్ణ, కోనేరు హంపి, విదిత్ గుజరాతి బరిలోకి దిగబోతున్నారు. అలాగే బి.అధిబన్, హారిక రిజర్వ్ ఆటగాళ్లుగా కొనసాగుతారు. వ్లాదిమిర్ క్రామ్నిక్ జట్టు సలహాదారుగా వ్యవహరించనున్నాడు. కరోనా నేపథ్యంలో ఎవరూ ఎక్కడికీ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్లోనే ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. భారత్తో పాటు రష్యా, అమెరికా, యూరప్, చైనా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతీ జట్టులో నలుగురు ఆటగాళ్లుండగా ఇందులో కచ్చితంగా మహిళా క్రీడాకారిణికి చోటివ్వాల్సి ఉంది. ర్యాపిడ్ ప్లే ఫార్మాట్లో పోరు ఉంటుంది.